హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 112 మందికి కూకట్పల్లిలోని 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జైలు శిక్ష విధించింది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 59 మందికి 3 నుంచి 10 రోజులు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 48 మందికి 4 రోజులు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన ఐదుగురికి నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి దుర్గాప్రసాద్ బుధవారం తీర్పు చెప్పారు. వాహన యజమానులకు రూ. 500 చొప్పున జరిమానా విధించారు. వీరిలో డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ రెండోసారి పట్టుబడ్డ రాంబాబు, రాజేందర్సింగ్, రవికుమార్, ఎం. శివకు 15 రోజుల జైలు శిక్షతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. వీరంతా బాలానగర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధుల్లో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm