సంగారెడ్డి: జిల్లాలోని కంగ్టి మండలం దేగులవాడి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బాధితుల్లో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. పొగమంచు వల్ల మూలమలుపు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడింది. కంగ్టి నుంచి కర్ణాటక వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm