పెర్త్: నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఒప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు, తొలి ఇన్నింగ్స్లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన ఓపెనర్ రాహుల్.. హజెల్వుడ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వరుసగా విఫలమవుతున్న రాహుల్.. తన చివరి పది ఇన్నింగ్స్ల్లో ఆరు సార్లు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్(0).. స్టార్క్ బౌలింగ్లో అవుటయ్యాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 277/6తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఆస్ట్రేలియా 108.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం భారత్ 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. పుజారా 2, కోహ్లీ 6 పరుగులుతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 310 పరుగులు వెనుకబడి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm