ముంబయి : ముంబయి నుంచి ఢిల్లీ మీదుగా లక్నో నగరానికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందని ఓ మహిళ ప్రయాణికురాలి నుంచి సమాచారం వచ్చింది. దీంతో లక్నోకు వెళ్లాల్సిన ఇండిగో విమాన సర్వీసును రద్దు చేసి విమానాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తరలించి బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ సభ్యులు తనిఖీలు జరిపారు. ఇండిగో విమానంలో ఎలాంటి బాంబు లేదని తనిఖీల్లో తేలింది. ఢిల్లీలో గో ఎయిర్ విమానంలో ప్రయాణించిన ఓ మహిళా ప్రయాణికురాలు కొందరి ఫోటోలు చూపించి వారితో ముప్పు ఉందని హెచ్చరించింది. దీంతో సీఐఎస్ఎఫ్ అధికారులు మహిళా ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm