రాచకొండ: పెద్దఅంబర్పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి రెండు బైక్లను ఢీకొట్టడంతో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అబ్దుల్లాపూర్మెట్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా కారు టైర్ పేలడంతో డివైడర్ను ఢీకొట్టి అవతలి రోడ్డులోకి దూసుకుచ్చింది. దీంతో అటుగా వస్తున్న రెండు బైక్లను కారు ఢీకొట్టింది. ఒక బైక్పై అవంతి కాలేజ్కు చెందిన వినంత్, మనిష్, మరో బైక్పై బ్రిలెంట్ కాలేజ్కు చెందిన పృద్ధన్, ఉమర్ ఉన్నారు. వీరిలో వినింత్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm