హైదరాబాద్: నగరంలో అమీర్పేట మెట్రో స్టేషన్లో ఏర్పాటు చేసిన ఐటీ హ్యాండ్లూమ్ మేళా ప్రారంభమైంది. ఈ మేళాను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ చేనేత ఉత్పత్తులను వినియోగించి కార్మికులను ప్రోత్సహించాలన్నారు. ప్రపంచానికి నాణ్యమైన చేనేత వస్ర్తాలను అందించిన ఘనత భారత్దే నన్నారు. హైటెక్ సిటీ మెట్రో కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయని అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm