హైదరాబాద్: భారత ఆర్మీలోకి మహిళా సైనికులను రిక్రూట్ చేసుకునే వీలు లేదని ఆర్మీ చీఫ్ బిపన్ రావత్ అభిప్రాయపడ్డారు. ఓ ఛానల్తో మాట్లాడుతూ..రావత్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మహిళలకు రణభూమీపై ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. మగ జవాన్లతో పాటు పయనం సాగించాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. వాస్తవానికి మహిళలను ఆర్మీలోకి తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామని ,కాని వాస్తవ పరిస్థితలు ఇందుకు భిన్నంగా ఉంటాయని తెలిపారు. దుస్తులు మార్చుకునే సమయంలో మగ జవాన్లు వేరే విధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే జవాన్లు ,వాళ్లంతా మహిళా ఆఫీసర్ ఆదేశాలను పాటించేందుకు సుముఖంగా ఉండరన్నారు. ఒకవేళ కమాండింగ్ ఆఫీసర్ గా మహిళలు ఉంటే, వాళ్లకు ఆరు నెలల మెటర్నిటీ సెలవును ఇవ్వలేమన్నారు. సెలవు ఇవ్వకుంటే పరిస్థితి మరోలా మారుతుందని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm