నూజివీడు: కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల చెల్లింపులో సూపర్వైజర్ చేతివాటం బట్టబయలైంది. విధులకు గైర్హాజరైన వారి పేర్లతో పూర్తి నెల జీతాలు విడుదలైనట్లు అధికారులు గుర్తించారు. బయోమెట్రిక్ పనిచేయడంలేదని 13 మంది సిబ్బంది జీతాలను సూపర్వైజర్ దుర్గా ప్రసాద్ జేబులో నింపుకున్నారు. సుమారు రూ.4 లక్షలు కాజేసినట్టు ట్రిపుల్ ఐటీ అధికారులు గుర్తించారు. మరోవైపు ట్రిపుల్ ఐటీలో ఉద్యోగాల అమ్మకాలపై ఆర్జీయుకేటీ కమిటీ విచారణ చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధమైంది.
Mon Jan 19, 2015 06:51 pm