రాజస్తాన్ : ఏదో చేయాలని అనుకుంటే ఇంకేదో కావడం అంటే ఇదే. చవకగా ఫోన్లు అందజేసి ప్రజల మద్దతును పొందుదామని అనుకున్న రాజస్తాన్ ప్రభుత్వానికి షాక్ ఎదురయింది. ప్రభుత్వం అందజేసిన ఫోన్ ఒకటి ఓ పెద్దాయన(60) జేబులోనే పేలిపోవడంతో మంటలు అంటుకుని ఆ వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన రాజస్తాన్ లోని నెతావల్ గఢ్ పరిధిలో చోటుచేసుకుంది.
రాజస్తాన్ లోని పాచ్లీ గ్రామంలో ఓ వృద్ధుడు ఇటీవల రాజస్తాన్ ప్రభుత్వం రూ.1100 కు అందజేసిన ఫోన్ ను కొన్నాడు. కాగా, ఈ ఫోన్ ను బనియన్ జేబులో పెట్టుకుని వెళుతుండగా నిన్న రాత్రి ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆయన మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యాడు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 15,2018 12:46PM