పెర్త్ : భారత్ ఉ ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు టీ విరామ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. స్వల్ప స్కోరుకే ఓపెనర్లిద్దర్నీ కోల్పోయిన భారత్ ను ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీలు ఆదుకున్నారు. ఇరువురూ నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా కాచుకున్నారు. ఈ క్రమంలో ఛటేశ్వర్ పుజారా 87 బంతులను ఎదుర్కొని ఒక ఫోర్ తో 23 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 78 బంతులను ఎదుర్కొని 5 ఫోర్లతో 37 పరుగులతో అజేయంగా ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 326 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm