క్యాన్బెరా : అత్యంత వివాదాస్పద అంశంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ కామెంట్ చేశారు. ఇజ్రాయల్ రాజధానిగా వెస్ట్ జెరుసలామ్ను గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. కానీ టెల్ అవివ్లో ఉన్న ఎంబసీని మాత్రం మార్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య శాంతి ఒప్పందం కుదరనంత వరకు తమ ఎంబసీని మార్చబోమని స్కాట్ మారిసన్ చెప్పారు. జెరుసలాంకు ఇవ్వాల్సిన హోదా అంశంపై ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య వివాదం చెలరేగుతూనే ఉన్నది. గత ఏడాది టెల్ అవివ్ నుంచి జెరుసలామ్కు దౌత్య కార్యాలయాన్ని అమెరికా మార్చింది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పద జెరుసలాం అంశాన్ని మరింత జఠిలం చేసింది. జెరుసలామ్లోని డిఫెన్స్తో పాటు ట్రేడ్ ఆఫీసును తెరవనున్నట్లు స్కాట్ మారిసన్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm