హైదరాబాద్ : రాఫెల్ డీల్ విషయంలో సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ అన్నారు. అటార్నీ జనరల్ను పిఎసి ఎదుట హాజరు కావాలని ఆదేశించాలని, తప్పుడు సమాచారం ఎందుకు సమర్పించారో అడగాలని ఆయన అన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమని ఆయన అన్నారు. రాఫెల్ డీల్పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు సరైన వేదిక కాదని కపిల్ సిబాల్ అన్నారు. ఫైళ్లను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించలేదని, వాటిని పరిశీలించలేదని ఆయన అన్నారు. అలాగే ప్రధానిని ప్రశ్నించలేదని ఆయన చెప్పారు. ప్రతిపక్షంగా తాము ప్రధానిని ప్రశ్నించగలుగుతామని ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm