హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మేనల్లుడు ఉదయ్ కుమార్ అంత్యక్రియలు చిత్తూరు జిల్లా కందులవారిపల్లెలో అశ్రునయనాల మధ్య జరిగాయి. ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న సీఎం.. కందులవారిపల్లె చేరుకొని ఉదయ్ కుమార్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. తన చెల్లెలు హైమావతిని పరామర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం ఉదయ్ కుమార్ అంతిమయాత్ర ప్రారంభమైంది.
Mon Jan 19, 2015 06:51 pm