హైదరాబాద్ : రాజకీయ పార్టీలకు అతీతంగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై పోరాటం చేస్తున్నామని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ విడుదల చేస్తున్నామని తెలిపారు. రూ. 3,500 కోట్లు విడుదల చేసి 13 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 23 నుంచి ఐదు రోజుల పాటు విజయవాడలో రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 21న గాంధీ విగ్రహాల వద్ద, 22న అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు తెలియజేస్తామన్నారు. 23న రాజకీయ నాయకుల ఇళ్ళ వద్ద నిరసనలు, వారి వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm