పెర్త్: ఆసీస్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాట్స్మెన్ కుదురుకున్నారు. ఈ క్రమంలో రహానె అర్ధశతకంతో రాణించాడు. 95 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ సాధించిన రహానె మొత్తం 50 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతడికిది 17వ అర్ధశతకం. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(82), రహానె(51) పరుగులతో క్రీజులో ఉన్నారు. 69 ఓవర్లు పూర్తయ్యే సమయానికి టీమిండియా మూడు వికెట్ల 172 పరుగులు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm