మహబూబాబాద్ : జిల్లాలోని బయ్యారం మండలం కొత్తూరు సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు ఆనంద్(58) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm