హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ హవా నడుస్తోందని, త్వరలో జరగబోయే సార్వత్రిక, పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని టీ-కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి ఓటమితో కార్యకర్తలు, నాయకులు అధైర్యపడొద్దని సూచించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలుకు, ప్రజాసమస్యల పరిష్కారానికి తాము పోరాడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీ-బీజేపీపై ఆయన విమర్శలు చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పలు చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని, అటువంటి పార్టీ ఎంపీ ఎన్నికల్లో ఏ మెుహం పెట్టుకుని పోటీ చేస్తుందని సెటైర్లు విసిరారు.
Mon Jan 19, 2015 06:51 pm