హైదరాబాద్ : కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్, రహానే అగ్రసివ్ బ్యాటింగ్ పుణ్యమా అని భారత్ రెండో రోజు ఆటముగిసే సరికి పటిష్ట స్థితిలోనే నిలిచింది. ఇరువురూ హాఫ్ సెంచరీలు సాధించి నాటౌట్ గా నిలిచారు. ఆటముగిసే సమయానికి కోహ్లీ 82 పరుగులతోనూ, రహానే 51 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరుతో ఈ రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 326 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తరువాత బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు. మురళీ విజయ్ డకౌట్ కాగా, లోకేష్ రాహుల్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఛటేశ్వర్ పుజారా 24 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఆ తరవుాత నుంచి కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానే సమయోచితంగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో ఇరువురూ హాఫ్ సెంచరీలు సాధించారు.
Mon Jan 19, 2015 06:51 pm