హైదరాబాద్ : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశానికి హోంమంత్రి మహముద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇంజినీర్లతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంపీ వినోద్ హాజరయ్యారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, సీతారామ ప్రాజెక్టులపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేసీఆర్ ముందుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm