జైపూర్: రాజస్తాన్ పీసీసీ అధ్యక్షుడు, కాబోయే ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ ట్వీట్లో అపశ్రుతి చోటు చేసుకుంది. నూతన ప్రభుత్వం ఏర్పాటుపై ట్వీట్ చేసిన ఆయన ఒకరికి బదులు మరొకరిని టాగ్ చేశారు. రాజస్తాన్ కాబోయే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు బదులు మరో అశోక్ గెహ్లాట్ను టాగ్ చేశారు.
ఉప ముఖ్యమంత్రిగా రాజస్తాన్కు సేవ చేసేందుకు నాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కృతజ్ఞలు. అలాగే రాజస్తాన్కు కాబోయే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు అభినందనలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చేందుకు నిజాయితీగా పని చేస్తానని రాజస్తాన్ ప్రజలకు హామీ ఇస్తున్నాను్ణ్ణ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో రాహుల్ గాంధీని అశోక్ గెహ్లాట్ను టాగ్ చేశారు. అయితే రాహుల్ గాంధీని సరిగానే టాగ్ చేసిన పైలట్, అశోక్ గెహ్లాట్ విషయంలోనే పొరబడ్డారు. అదే పేరుతో (అశోక్ గెహ్లాట్) ఉన్న మరో వ్యక్తిని పైలట్ టాగ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 15,2018 04:08PM