హైదరాబాద్ : ఫారెస్ట్ ఆఫీసర్లు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రూ. 60వేలు లంచం తీసుకుంటూ ఫారెస్ట్ ఆఫీసర్లు శ్రీనివాస్, సాజిద్ పాషా, డ్రైవర్ ఫసి అధికారులకు చిక్కారు. టింబర్ డిపో యజమాని నుంచి ఫారెస్ట్ ఆఫీసర్లు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm