హైదరాబాద్ : తమిళనాడునుంచి 30 మందికి పైగా మహిళలు శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 22న వారు ఇక్కడినుంచి బయలుదేరి 23న శబరిమల చేరుకోనున్నారు. పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉన్నా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు మణితి అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన వారు. మహిళలు, శిశువుల సంక్షేమం కోసం ఈ సంస్థ కృషి చేస్తుంటుంది. అయ్యప్ప ఆలయంలోకి అందరికీ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తమకెంటే సంతోషం కలుగజేసిందని వసుమతి వసంత్ అనే మహిళ చెప్పారు. శబరిమలలో నిరసనకారులు అనేకమంది మహిళలను వెనక్కు పంపించడం దురదృష్టకరమని ఆమె అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm