ఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ నుంచి 23 మంది భారతీయుల పాస్పోర్టులు కనిపించకుండా పోయినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పాస్పోర్టులు పాకిస్థాన్లోని గురుద్వారాలు సందర్శించుకునేందుకు వెళ్లబోయే సిక్కు భక్తులకు చెందినవిగా తెలుస్తోంది. తమ పాస్పోర్టులు కనిపించకుండా పోయినట్లు కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని విదేశాంగశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సదరు ఫిర్యాదుదారులు వెల్లడించారు. పాస్పోర్టులు అదృశ్యమైన విషయాన్ని పాక్ అధికారులతో భారత్ విదేశాంగశాఖ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm