నిర్మల్: నిర్మల్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి అభిమానులు, కార్యకర్తల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్వరాజ్ మహల్ కాలనీకి చెందిన మైనారిటీ విభాగం నేతలు ఆయనను శనివారం కలిసి పూల మాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనకు లడ్డూ మిఠాయిలతో తులాభారం వేశారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని గెలిపించారని అన్నారు. కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పథకాలను చూసి రాష్ట్ర ప్రజలు తెరాస ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టారని తెలిపారు. సిద్దిపేటలో హరీశ్రావును ప్రజలు లక్షా 18 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిపించారని, ఈ మెజార్టీ దేశంలో ఎవరికీ రాలేదని అన్నారు. నిర్మల్లో తనను మరోసారి గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm