హైదరాబాద్: ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్సబర్వాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అకాల వర్షాలు, తడిసిన ధాన్యం కొనుగోలుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. జనగామ, జగిత్యాల, నిర్మల్, తాండూర్, మహబూబ్నగర్, మేడ్చల్, మంచిర్యాల జిల్లాల్లో అకాల వర్షాలతో నష్టంపై ఆరా తీశారు. ఆయా జిల్లాల అధికారులతో కమిషనర్ ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... బాధిత రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm