హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమానికి నాయకత్వం వహించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసిన కేతిరెడ్డి.. ముందస్తు ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ జయలలిత, కరుణానిధి మరణం తర్వాత దక్షిణాదిలో పోరాటపటిమ ఉన్న నాయకుల లేమి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరం. ప్రత్యామ్నాయ పార్టీలు లేకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని శాసిస్తున్నాయి. నూతన బలమైన నాయకత్వం ఉంటే ప్రజలందరూ ఆ నాయకుడి వెంట నడుస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm