హైదరాబాద్ : అల్పపీడనం నుండి వాయుగుండం.. వాయుగుండం నుండి తుఫాన్ గా పెథాయ్ గా నామకరణం చెంది కోస్తాఆంధ్ర మీదకి వస్తున్న తుఫాన్ ప్రభావం దక్షణ కోస్తా మీద ప్రభావం చూపనుంది. మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలపై అధిక ప్రభావం చూపనుందని ఆర్టీజీఎస్ మరియు వాతావరణ శాఖ అంచనావేస్తోంది. ఈరోజు, రేపు దక్షణ కోస్తాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా ఈ మూడు జిల్లాలలో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ మూడు జిల్లాలకు అదనపు కలెక్టర్లను, రెవెన్యూ పరిధికి ఒక ప్రత్యేక అధికారిని.. అత్యవసర అవసరాల కోసం ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm