హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం జాతీయ స్థాయి పుస్తకాల పండుగకు మరోసారి వేదికైంది. ఈ రోజు నుంచి ప్రారంభమై.. 25వ తేదీ వరకు 32వ జాతీయ పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ స్టేడియంలో పదకొండు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ వేడుకలో దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ర్టాలు పాల్గొన్నాయి. 330 స్టాల్స్తో పలువురు పబ్లిషర్స్ పాల్గొన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఆంగ్ల భాషకు సంబంధించిన ఎన్నో భాషల పుస్తకాలు ఈ ఉత్సవంలో భాగంగా అందుబాటులోకి వస్తున్నాయి. తెలుగు భాషకు సంబంధించి నవ తెలంగాణ, విశాలాంధ్ర, నవ చేతన, ఎమెస్కో, జైకో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి పుస్తకాలు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm