హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలి సమావేశం అనంతరం తెలంగాణ భవన్ లో మాట్లాడిన కేటీఆర్ కేంద్రంలో బీజేపీ-కాంగ్రెస్ దొందూ దొందే అన్నారు. కేంద్రంలో రాజకీయాలను శాసించే స్థాయిలో తెలంగాణ ఉండాలని దానికి తొలిఅడుగు పదహారు పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలన్నారు. కేంద్రంలో శాసించే స్థాయిలో ఉంటేనే రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకోగలమన్నారు. ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీ-కాంగ్రెస్ దొందూ దొందేనని మరో ప్రత్యామ్నాయం దిశగా అడుగులువేయాలన్నదే టీఆర్ఎస్ ప్రయత్నమన్నారు. కేంద్రంలో రాజకీయాలను శాసించేదిశగా పార్టీని బలోపేతం చేయాలన్నదే మనముందున్న లక్ష్యమన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm