ముంబయి: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం.. శక్తికాంత దాస్ను నియమించడం పట్ల శివసేన పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఆయనను ఆ పదవిలో నియమించడం ప్రమాదకరమని పేర్కొంది. నిజాలు మాట్లాడే వారంటే భారతీయ జనతా పార్టీకి ఇష్టం ఉండదు. తాము తీసుకునే నిర్ణయాలపై సానుకూలంగా స్పందిస్తూ తల ఊపే వారంటేనే ఆ పార్టీకి ఇష్టం. దాస్ను ఆర్బీఐ గవర్నర్గా నియమించడం వెనుక ఆ పార్టీ అసలు ఉద్దేశం ఇదే అయితే.. దేశంలో ఆర్థిక ఉగ్రవాదం ప్రారంభం కాబోతుందనే చెప్పుకోవాలి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను దాస్ ప్రశంసించారు. నవంబరు 2016న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఆయన గుడ్డిగా సమర్థించారు. ఆ సమయంలో దేశ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. కొత్త రూ.2,000 నోట్ల చలామణి విషయంలో చాలా అనుమానాలు వచ్చిన సమయంలో దాన్ని కూడా సమర్థించేలా మాట్లాడారు అంటూ ఆ పార్టీ తమ పత్రిక సామ్నాలో ఓ కథనం ప్రచురించింది.
Mon Jan 19, 2015 06:51 pm