హైదరాబాద్ : భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ రానున్నారు. శీతాకాల విడిది కోసం నగరానికి వస్తున్న ఆయన 21 నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు ఇక్కడే బసచేయనున్నారు. అప్పటి వైస్రాయ్ విడిది అయిన నేటి బొల్లారం రాష్ట్రపతి భవన్లో అయన బసకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజభవనాన్ని తలపించే ఆ కట్టడానికి ఎన్నో ప్రత్యేకతలు ఉండగా గార్డెన్కు కూడా ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రపతి భవనంతో పాటు గార్డెన్ను అధికారులు సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm