బెంగళూరు : ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్ను దాటబోయి 42 ఏళ్ల వయసున్న ఓ ఏనుగు మృతిచెందింది. ఈ సంఘటన కర్నాటకలోని నాగర్హోల్ నేషనల్ పార్క్లో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి అడవిలో నుంచి బయటకు వచ్చిన ఏనుగు పంటపొలాల్లో సంచరించి తిరిగి వీరాహోసహల్లీ రేంజ్లోకి వెలుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే ఫెన్స్ దాటే సమయంలో ఏనుగు మధ్యలోనే ఇరుక్కుని చాలా సమయం కొట్టుమిట్టాడినట్టు తెలుస్తోంది. ఇదే విధంగా నాగర్హోల్ జాతీయ పార్క్లో గత నవంబర్లో కూడా ఓ ఏనుగు మృతిచెందింది. ఎన్నో ఏళ్లుగా ఏనుగులు సంచరించే ప్రాంతాలనే మానవులు ఆక్రమిస్తూ వాటి మార్గాల్లో ఫేన్సింగ్లు నిర్మించడమేంటని జంతుప్రేమికులు మండిపడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm