హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలోని షెడ్యూల్ కులానికి సంబంధించిన నిరుద్యోగ యువతీ, యువకులకు టెక్నాలెడ్జ్ శిక్షణ సంస్థ ద్వారా జావా. టెస్టింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వబడునని ఎస్సీ కార్పోరేషన్ జిల్లా డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 12లోగా దరఖాస్తుకు చివరితేదీగా ప్రకటించారు.బీటెక్లో సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ విభాగాలలో ఇంజనీరింగ్ పూర్తిచేసి 18 సంవత్సరాలు నిండిన అభ్యర్ధులు ఈ కోర్సుకు అర్హులని తెలిపారు. విద్యార్హాత, ఆదాయం, ఆధార్కార్డు జీరాక్సులతో ఎస్సీ కార్పోరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రాం క్రింద శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ కాలంలో పూర్తి హాస్టల్ వసతి కల్పించబడుతుందని తెలిపారు.శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పించబడుతుందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm