హైదరాబాద్ : డిసెంబర్ 15వ తేదీ వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో 961 మందిపై కేసు నమోదు చేసినట్లు నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్కుమార్ తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరచగా 265 మందికి జైలు శిక్షలు ఖరారు చేస్తూ నాంపల్లి 3,4వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులు తీర్పు చెప్పాయన్నారు. దీంతో పాటు 8 మంది డ్రైవింగ్ లైసెన్స్లు దీర్ఘకాలం, 50 మందివి తాత్కాలికంగా రద్దయ్యాయని, సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన కేసులో ఆరు మందికి జైలు శిక్షలు ఖరారయ్యారని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm