హైదరాబాద్ : సినీ నటి, మోడల్ లీనా పాల్పై బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కొచ్చిలోని పానంపిల్లీలో ఉన్న నటి బ్యూటీ పార్లర్ వద్ద శనివారం మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన జరిగినప్పుడు నటి బ్యూటీ పార్లర్ 'నెయిల్ ఆర్టిస్ట్రీ' పార్లర్ రద్దీగా ఉంది. దుండగులు లోపలికి వెళ్లకుండా బయటి నుంచే కాల్పులు జరపడంతో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. అండర్ వరల్డ్తో ఆర్థిక పరమైన అంశాల్లో విభేదాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోందని పేర్కొన్నారు. బైక్పై వచ్చిన దుండగులు ఎయిర్ గన్స్ ఉపయోగించినట్టు పోలీసులు తెలిపారు. పార్లర్ వద్ద, ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లీనాపై వివిధ నగరాల్లో చీటింగ్ కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 16,2018 07:02AM