హైదరాబాద్ : పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన కెరీర్ లో 25వ సెంచరీని సాధించాడు. ఓపెనర్లు తక్కువ స్కోరుకే విఫలమైనా, అండగా నిలిచి భారీ స్కోరును మరెవరూ సాధించలేకపోయినా, ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ కోహ్లీ ముందుకు సాగి, భారత స్కోరును 200 పరుగులు దాటించాడు. సెంచరీ సాధించేందుకు కోహ్లీకి 219 బంతులు అవసరమయ్యాయంటే, ఇన్నింగ్స్ ఎంత నిదానంగా సాగిందో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం భారత జట్టు స్కోరు 239/5 క్రీజులో కోహ్లీ 117, పంత్ 7 పరుగులతో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm