హైదరాబాద్ : ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ పివి సింధు జోరు కొనసాగుతోంది. ఈ టోర్ని ఫైనల్లోకి సింధూ దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీస్లో సింధు థాయిలాండ్కు చెందిన ఇంతనోన్ రచనోక్పై ఘన విజయం సాధించి తుది పోరుకు సిద్ధమైంది. సెమీస్లో సింధూ 21-16, 25-23 స్కోరుతో వరుస గేమ్స్ల్లో విజయం సాధించింది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్లో వరసగా రెండో ఏడాది కూడా తుదిపోరుకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్స్లో సింధు జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకురహతో తలపడనుంది.
Mon Jan 19, 2015 06:51 pm