హైదరాబాద్: నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఒప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు, మొదటి ఇన్నింగ్స్లో భారత్ వరుస ఓవర్లలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కమ్మిన్స్ వేసిన ఇన్నింగ్స్ 93వ ఓవర్ చివరి బంతికి కెప్టెన్ కోహ్లీ అవుటవ్వగా, లియాన్ వేసిన తర్వాతి ఓవర్లోనే షమీ పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఏడు వికెట్లు కోల్పోయి, ఆలౌట్ ప్రమాదంలో పడింది. కోహ్లీ 257 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్తో 123 పరుగులు చేయగా, షమీ డకౌట్ అయ్యాడు. మరో ఎండ్లో కీపర్ పంత్ ఆడుతున్నా.. బౌలర్ల నుంచి అతడికి ఏ మేరకు సహాయం లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. లంచ్ విరామ సమయానికి భారత్ 93.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. పంత్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 74 పరుగులు వెనుకబడి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm