హైదరాబాద్ : తనను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టాలన్న ఉద్దేశమే తప్ప, తాను బకాయి పడ్డ డబ్బును తిరిగి వెనక్కు తీసుకోవాలన్న ఉద్దేశం ఇండియాకు లేదని యూబీ గ్రూప్ మాజీ చీఫ్ విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు. బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన ఆయన, ఇండియాకు వెళ్లి తీరాలని వెస్ట్ మినిస్టర్స్ కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో, ఓ మీడియా సంస్థకు మాల్యా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
లండన్ కోర్టు తీర్పుపై అపీలు చేసే ఆలోచనలో తానున్నానని, తన న్యాయవాదులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారని మాల్యా వ్యాఖ్యానించారు. తాను బకాయిపడ్డ రుణాలను సెటిల్ చేసుకునేందుకు 2016 నుంచి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నానని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా తెలియజేశానని మాల్యా వ్యాఖ్యానించారు. తానిచ్చిన ప్రతి ఆఫర్ నూ తిరస్కరించాలని సీబీఐ, ఈడీలు బ్యాంకులపై ఒత్తిడి తెచ్చాయని ఆరోపించారు. బ్యాంకులు, ఈడీ తన ఆస్తుల కోసం కొట్టుకుంటున్నందున, సెటిల్ మెంట్ ఆఫర్ ను కర్ణాటక హైకోర్టు ముందు ఉంచానని, కోర్టే తన ఆస్తులను విక్రయించి, బ్యాంకులకు బకాయిలను, ఉద్యోగులకు వేతనాలను చెల్లించుకోవచ్చని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 16,2018 10:11AM