హైదరాబాద్ : కరీంనగర్-తిరుపతి రైలు ఇకపై వారంలో నాలుగు రోజులు నడుస్తుందని కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ తెలిపారు. శనివారం సికింద్రాబాద్ రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్కుమార్గుప్తాతో సమావేశమైన అనంతరం రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. కరీంనగర్ ప్రజల కోరిక మేరకు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కరీంనగర్-తిరుపతి రైలును వారంలో నాలుగుసార్లు నడిపేందుకు రైల్వేశాఖ అంగీకరించిందని వెల్లడించారు. కరీంనగర్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో గల లెవల్ క్రాసింగ్ వద్ద రూ.102కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సైతం రైల్వే బోర్డు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మనోహరాబాద్-కొత్తపల్లి నూతన మార్గంలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 2019 మార్చి 21వరకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు రైల్వేశాఖ నిర్ణయించిందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm