హైదరాబాద్ : బీజేపీతో అంటకాగే జగన్కు ఎంఐఎం ఎలా మద్దతిస్తుందని మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ఓవైసీ రాజకీయ సిద్ధాంతాలను పక్కనపెట్టి బీజేపీ బలపడేలా చేస్తారా అని ప్రశ్నించారు. దేశంలో ఈవీఎంలు తరచుగా విఫలమవుతున్నాయన్నారు. లక్షలాది మంది ఓట్లు గల్లంతయ్యాయన్నారు. ఎన్నికల్లో లోపాల సవరణ కేంద్ర ఎన్నకల కమిషన్ బాధ్యత అని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm