హైదరాబాద్ : డబ్బుతో సమాజంలో మార్పు సాధ్యం కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ డల్లాస్లో డాక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తనకు రాజకీయం తెలియదని, మానవత్వం మాత్రమే తెలుసన్నారు. తుదిశ్వాస వదిలేలోపు సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకొస్తానన్నారు. ఉద్దానం సమస్య పరిష్కారానికి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm