హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న నలుగురిలో భూపేశ్ బఘేల్ వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపినట్లు సమాచారం. ఈమేరకు కాంగ్రెస్ శాసన సభాపక్ష భేటీలో ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది. రాయ్పూర్లో రేపు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుర్మి సమాజిక వర్గానికి చెందిన భూపేశ్.. మధ్యప్రదేశ్లో దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm