హైదరాబాద్ : తాము దేశ భద్రతా బలగాలను మరింత శక్తిమంతం చేయాలని ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం బలహీనపర్చాలని చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్బరేలీలో ఆయన ఈ రోజు పర్యటించారు. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో రెండు రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ వైపు మన భద్రతా బలగాలను మరింత శక్తిమంతం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోవైపు, ఏది ఏమైనా వారిని బలహీనపర్చాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. ఆ పార్టీ నేతలు మెరుపు దాడులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మన దేశ ఆర్మీ కంటే శత్రువుల మాటలను నమ్ముతున్నారు అని విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm