హైదరాబాద్ : ఈ నెల 24న ఎన్నికల ఫలితాలపై అమిత్ షాతో చర్చిస్తామని భారతీజ జనతా పార్టీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మీడియాతో మాట్లడుతూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, లోపాలను సరిదిద్దుకుని పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దమవుతామన్నారు. 300 సీట్లు గెలుచుకుని కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఫ్రంట్ రాజకీయాల వల్ల దేశం తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm