మచిలీపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాన్ రేపు మధ్యాహ్నం తీరందాటే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనావేస్తుంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయదిశగా 410 కిమీ, మచిలీపట్నానికి దక్షణ ఆగ్నేయదిశగా 530 కిమీ దూరంలో గంటకు 19 కిమీ వేగంతో తీరంవైపుకు దూసుకొస్తోంది. ఉత్తర వాయువు దిశగా పయనించే అవకాశం ఉండగా ఈరాత్రికి తీవ్ర తుఫాన్ గా మారి రేపు తీరందాటే అవకాశం ఉందంటున్నారు. దీని ప్రభావంతో కృష్ణా, గుంటూరు, తూగో, పగో, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. తుఫాన్ తీరందాటే సమయంలో వంద కిమీవేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తెలంగాణలోను దీని ప్రభావంతో జల్లులు కురిసే అవకాశంతో పాటు చలిగాలులు వీయనున్నాయని చెప్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm