న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పదం కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించిందని ఆరోపించింది. ఆదివారంనాడిక్కడ మీడియాతో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ, సుప్రీంకోర్టును ప్రభుత్వం తప్పుదారి పట్టించడం ద్వారా అనుకూలంగా తీర్పు వచ్చేలా చూసుకుందని అన్నారు. అందులో దొర్లిన పొరపాటు వెలుగుచూసే సరికి ఆంగ్ల భాషను సుప్రీంకోర్టు సరిగా అర్థం చేసుకోలేదంటూ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. ఆ దృష్ట్యా తామిచ్చిన తీర్పు చెల్లకుండా సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగ్ పరిశీలించిన ధరల కోణాన్ని పీఏసీ ఇంకా పరిశీలించలేదని, తీర్పులో ఈ కరెక్షన్ చేర్చాలని కోరుతూ రాఫెల్పై అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన మరుసటి రోజు ఒక అప్లికేషన్ను సుప్రీంకోర్టుకు కేంద్రం దాఖలు చేసింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి అక్రమాలు జరిగాయని, దానిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని దాఖలైన పిటిషన్లను ఈనెల 14న సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఒప్పంద ప్రక్రియలో అనుమానించడానికి ఏమీ లేదని, అంతా పారదర్శకంగా ఉందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, ఎస్కె కౌల్, కేఎం జోసఫ్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 16,2018 05:19PM