అమరావతి: ఏపీ ప్రభుత్వం ఏడుజిల్లాలకు హై అలర్ట్ ప్రకటించింది. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిలాల్లతో పాటు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాలకు కలెక్టర్లతో ఇంచార్జ్ అధికారులను నియమించిన ప్రభుత్వం ముందస్తు చర్యలను సిద్ధం చేసుకుంది. తీవ్ర తుఫాన్ సమయంలో పెనుగాలులు వీచే అవకాశం ఉండడంతో విద్యుత్ అంతరాయం కలగనుండగా జనరేటర్లు, స్తంభాలు కూలిపోతే పునఃనిర్మాణం, ఆహార నిల్వలు, మంచినీరు ట్యాంకర్లు, విప్పత్తు నిర్వహణ యంత్రాంగంతో సహా అన్నీ సిద్ధం చేసుకున్నారు. గతంలో తుఫాన్ సమయంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులను స్పెషన్ ఆఫీసర్లుగా ఎప్పటికప్పుడు తుఫాన్ పై సమీక్షలు నిర్వహించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm