కేరళ : శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్తున్న నలుగురు ట్రాన్స్ జెండర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన ఈరోజు చోటుచేసుకుంది. నలుగురిలో ఒకరైన అనణ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమను డ్యూటీలో ఉన్న అధికారులు అడ్డుకున్నారని... ఆలయం వైపు వెళ్లకుండా నిలువరించారని విమర్శించారు. అయితే, వీరి ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఆలయ పరసరాల్లోని ఉద్రికత్తల గురించి వారికి తాము తెలియజేశామని... దీంతో, వారే వెనుదిరిగారని చెప్పారు.
ఈ ఘటన అనంతరం కొట్టాయం జిల్లా ఎస్పీని కలిసేందుకు నలుగురు ట్రాన్స్ జెండర్లు వెళ్లారు. ఆలయనికి సంబంధించిన అబ్జర్వేషన్ కమిటీని కూడా కలవాలని వారు భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Dec 16,2018 06:58PM