హైదరాబాద్ : ఏయంబీ మల్టిప్లెక్స్ థియేటర్తో కొత్తగా వ్యాపారరంగంలోకి ప్రవేశించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన కల నెరవేరిందంటూ సంతోషాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు. ప్రముఖ ఏసీ తయారీ కంపెనీ లాయిడ్ ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వ్యాపారరంగంలోకి తను అడుగుపెట్టడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్లిప్లెక్స్ బిజినెస్ అనేది తన కల అని .. అది ఇప్పుడు నెరవేరిందన్నారు. ఏషియన్స్ ఫిల్మ్స్ సహకారంతో బిజినెస్ చేస్తున్నట్టు తెలిపారు. తాను మొదట నటుడినని.. ఆ తర్వాతే వ్యాపారినని చెప్పారు. వ్యాపారాన్ని, సినిమాలను బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బంది లేదన్నారు. మల్టిప్లెక్స్లలో సినిమా చూడటం తనకు చాలా ఇష్టమని.. ఇప్పుడు సొంత థియేటర్ ఉండటం చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm